5జీ కోసం ఎయిర్‌టెల్, చైనా మొబైల్ ఒప్పందం


 బార్సిలోనా: 5జీ వంటి హై-టెక్నాలజీ, 4జీ సేవల విస్తరణ, పలు టెలికాం పరికరాల ఉత్పత్తికోసం భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు, ప్రపంచ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ చైనా మొబైల్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ‘ప్రపంచంలోని మొత్తం మొబైల్ వినియోగదారుల్లో మూడో వంతు చైనా, భారత్‌లలో ఉన్నారు. ఈ ఒప్పందం 4జీ అభివృద్ధి, విస్తరణతోపాటు 5జీ సేవలకు, డాటా వినియోగంలో విప్లవాత్మకమైన వృద్ధికి అనువైన వేదికగా మారనుంది’ అని ఎయిర్‌టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు సంస్థలు పోర్టబుల్ వై-ఫై పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, డాటా కార్డులు, మోడెం, యూనివర్సల్ సిమ్ తదితర ఉత్పత్తులను రూపొందించనున్నాయి. ఉమ్మడి భాగస్వామ్యంతో నెట్‌వర్క్ పరికరాలు, పలు కొత్త ఉత్పత్తుల కోసం అవసరమైన టెక్నాలజీని పరస్పరం మార్పిడి చేసుకోనున్నాయి.

 


బార్సిలోనా: 5జీ వంటి హై-టెక్నాలజీ, 4జీ సేవల విస్తరణ, పలు టెలికాం పరికరాల ఉత్పత్తికోసం భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు, ప్రపంచ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ చైనా మొబైల్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ‘ప్రపంచంలోని మొత్తం మొబైల్ వినియోగదారుల్లో మూడో వంతు చైనా, భారత్‌లలో ఉన్నారు. ఈ ఒప్పందం 4జీ అభివృద్ధి, విస్తరణతోపాటు 5జీ సేవలకు, డాటా వినియోగంలో విప్లవాత్మకమైన వృద్ధికి అనువైన వేదికగా మారనుంది’ అని ఎయిర్‌టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు సంస్థలు పోర్టబుల్ వై-ఫై పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, డాటా కార్డులు, మోడెం, యూనివర్సల్ సిమ్ తదితర ఉత్పత్తులను రూపొందించనున్నాయి. ఉమ్మడి భాగస్వామ్యంతో నెట్‌వర్క్ పరికరాలు, పలు కొత్త ఉత్పత్తుల కోసం అవసరమైన టెక్నాలజీని పరస్పరం మార్పిడి చేసుకోనున్నాయి.



ఎయిర్‌టెల్, చైనా మొబైల్, 5జీ,

airtel, china mobile, 5G

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top