నైజర్ నదిలో కూలిన అల్జీరియా విమానం

నైజర్ నదిలో కూలిన అల్జీరియా విమానం - Sakshi


అల్జీర్స్: భూతలంతో సంబంధాలు కోల్పోయిన అల్జీరియా విమానం ఆఫ్రికాలో కూలిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆఫ్రికా దేశమైన నైజర్ లోని ఓ నదిలో విమానం కూలిపోయినట్టు సమాచారం. విమానంలో ఉన్న 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.



ఏహెచ్ 5017 నెంబరు గల ఈ విమానం బుర్కినాఫాస్ నుంచి అల్జీర్స్కు వెళుతుండగా మాయమైంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యం అయ్యింది. వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top