అగ్రిగోల్డ్పై 9న హైకోర్టు ఉత్తర్వులు


హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసును శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. 300 ఆస్తుల వివరాలను అగ్రిగోల్డ్ హైకోర్టుకు సమర్పించింది. అయితే అందులో 5 ప్రధాన ఆస్తులు విక్రయానికి హైకోర్టు మంగళవారం సూత్రప్రాయంగా అంగీకరించింది. అలాగే బాధితుల కోసం రిజిస్ట్రార్ పేరు మీద బ్యాంకు ఖాతా తెరవాలని హైకోర్టు పేర్కొంది. సదరు సంస్థ ఆస్తులు విక్రయించగా వచ్చిన నగదు ఈ ఖాతాలో జమ చేయాలని తెలిపింది. అవసరమైతే సంస్థకు చెందిన మొత్తం ఆస్తులు విక్రయించి... బాధితులకు చెల్లించాలని చెప్పింది.


అలాగే ఈ  కేసుతో సంబంధం ఉన్న అధికారులు... యాజమాన్యం శుక్రవాం హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. అగ్రిగోల్డ్ కేసు మొత్తం విచారణ మంగళవారం ముగిసింది.  కాగా ఆస్తుల విక్రయంపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అగ్రిగోల్డ్ సంస్థ యాజమాన్యానికి హైకోర్టు సూచించింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top