అంబటి రాంబాబు అరెస్ట్.. స్టేషన్ ముందు ఆందోళన
సత్తెనపల్లి(గుంటూరు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కేంద్ర పాలక మండలి సభ్యుడు అంబటి రాంబాబును గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర బంద్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు, సీపీఎం, సీపీఐ కార్యకర్తలతో కలసి శనివారం ఆయన పట్టణంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీంతో స్టేషన్ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.