ఘర్షణల్లో 47 మంది మృతి

ఘర్షణల్లో 47 మంది మృతి


బాగ్దాద్: ఇరాక్లో ప్రభుత్వ బలగాలకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు మధ్య జరిగిన  పరస్పరదాడుల్లో 47 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సామాన్య పౌరులతోపాటు కొందరు ఉగ్రవాదులు, రక్షణ బలగాల సైనికులు కూడా ఉన్నారు. గురువారం సలాలుద్దీన్, అన్బర్ అనే చోట ఈ దాడులు జరిగాయి. ఇప్పటికే పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వస్తున్న ఇస్లామిక్ స్టేట్ తాజాగా సలాలుద్దీన్ ప్రావిన్స్ను కూడా ఆక్రమించుకునే ప్రయత్నంగా అక్కడికి వచ్చాయి. అదే సమయంలో వారిని నిలువరించేందుకు అక్కడికి చేరుకున్న బలగాలు వారిపై దాడికి దిగడంతో పరస్పర తీవ్ర ఘర్షణలు నెలకొని ప్రాణనష్టం చోటుచేసుకుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top