రోడ్డు ప్రమాదం: 30 మంది దుర్మరణం

రోడ్డు ప్రమాదం: 30 మంది దుర్మరణం - Sakshi


అబూజా: నైజీరియా కొగీ రాష్ట్రంలోని లొకొజా - అబూజా జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది అక్కడికక్కడే మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.


అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు అనే విషయాన్ని మాత్రం ఫెడరల్ రోడ్డు సేఫ్టీ కమిషన్ తెలపాల్సి ఉంది. లావోస్ నగరం నుంచి రాజధాని అబూజాకు బస్సు  వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top