3.3 కిలోల బంగారాన్ని పొడిగా మార్చి..


శంషాబాద్(రంగారెడ్డి): బంగారం అక్రమ తరలింపు కొత్తపుంతలు తొక్కుతోంది. వినూత్న పద్ధతుల్లో బంగారాన్ని దేశంలోకి తీసుకువచ్చేందుకు విమాన ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి షూలను కస్టమ్స్ అధికారులు అనుమానంతో సోదా చేయగా సుమారు 3 కిలోల 300 గ్రాముల బంగారం పొడి బయటపడింది. దీని విలువ సుమారు రూ.88 లక్షలు ఉంటుంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top