టాయ్లెట్లో.. 22 ఐఫోన్ మొబైల్స్

టాయ్లెట్లో.. 22 ఐఫోన్ మొబైల్స్


న్యూఢిల్లీ: దేశంలో ఇంకా విడుదల కాని యాపిల్ కంపెనీ కొత్త మోడల్ ఐఫోన్ 6 ఎస్ మొబైల్స్ను అక్రమంగా తరలిస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ టాయ్లెట్లో దాచిన 22 ఐఫోన్లను కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సిబ్బంది గుర్తించి కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

 

దుబాయ్ నుంచి వచ్చిన పంజాబ్కు చెందిన ఓ ప్రయాణికుడి పాత్రపై అధికారులు విచారణ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే 182 ఐఫోన్  6 ఎస్, 6 ఎస్ ప్లస్ మొబైల్స్ను అక్రమంగా తరలిస్తున్న ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా, కొత్త మోడల్ ఐఫోన్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్ను వచ్చే శుక్రవారం భారత్ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top