17 ఏళ్ల యువతిపై ఉపాధ్యాయుడి అత్యాచారం
ఉత్తరప్రదేశ్లోని సంభల్లో 17 ఏళ్ల యువతిపై ఆమె చదువుతున్న పాఠశాలలోని ఉపాధ్యాయుడే అత్యాచారం చేశాడు. ఈ సంఘటన అట్రా గ్రామంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆమె పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు సర్కిల్ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ అత్రి చెప్పారు.
ఆ టీచర్ ఆమెను సమీపంలో ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి, బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడని అంటున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.