17 ఏళ్ల యువతిపై ఉపాధ్యాయుడి అత్యాచారం

17 ఏళ్ల యువతిపై ఉపాధ్యాయుడి అత్యాచారం - Sakshi


ఉత్తరప్రదేశ్లోని సంభల్లో 17 ఏళ్ల యువతిపై ఆమె చదువుతున్న పాఠశాలలోని ఉపాధ్యాయుడే అత్యాచారం చేశాడు. ఈ సంఘటన అట్రా గ్రామంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆమె పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు సర్కిల్ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ అత్రి చెప్పారు.



ఆ టీచర్ ఆమెను సమీపంలో ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లి, బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడని అంటున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top