బాలికపై క్లాస్మేట్స్ గ్యాంగ్ రేప్
గుర్గావ్:టీనేజ్ బాలికలు, మహిళలపై మృగాళ్ల ఆగడాలకు శృతిమించుతూనే ఉన్నాయి. ఓ విద్యార్థిని (16)పై సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గుర్గావ్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు విద్యార్థిని శుక్రవారం గుర్గావ్ బస్సు స్టాప్ లో బస్సు ఎక్కేందుకు నిల్చున్న సమయంలో అక్కడకు వచ్చిన కొంతమంది తోటి విద్యార్థులు తమ వెంట రావాలని సూచించారు. అయితే ఆ మాటల్లో కల్మషాన్నిఅర్థం చేసుకోలేని ఆ యువతి వారి వెంట వెళ్లింది.
అనంతరం ఆ యువతిని మనేసర్ కు సమీపంలోని ఓ నిర్జీవ ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై ఐపీఎస్ మరియు లైంగిక నేరాల కేసులు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హజరుపరిచామని.. అనంతరం ఆ నిందితులను జువెనైల్ హోంకు తరలించామన్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టామన్నారు.