ఈ-మెయిల్ ద్వారా 14 మంది ఇంజనీర్లు సేఫ్!

ఈ-మెయిల్ ద్వారా 14 మంది ఇంజనీర్లు సేఫ్!


బెంగళూరు: అడవుల్లో చిక్కుకుపోయిన 14 మంది సాప్ట్వేర్ ఇంజనీర్లు ఈ-మెయిల్ ద్వారా సురక్షితంగా బయటపడగలిగారు. చెన్నైకి చెందిన ఈ ఇంజనీర్లు  కర్ణాటక హాసన్ జిల్లాలోని అడవుల్లోకి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దట్టమై ఆ అడవుల్లో వారు దారి తప్పారు.



తాము దారి తప్పిన విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా వారు తమ మిత్రులకు  తెలియజేశారు. ఆ మిత్రులు ఈ విషయం అటవీ శాఖ సిబ్బందికి తెలిపారు. అటవీ సిబ్బంది వెంటనే స్పందించి అడవిలో వెతికి వారిని పట్టుకున్నారు. అటవీ సిబ్బంది కనిపించగానే ఆ ఇంజనీర్లకు ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినంత పనైంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top