రెండు బస్సులు ఢీ.. 11 మంది దుర్మరణం
ముంబయి: రహదార్లు రక్తమోడుతున్నాయి. ముంబయిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో వాటిల్లోని ప్రయాణీకుల్లో పదకొండుమంది ప్రాణాలు కోల్పోయారు. పదిహేనుమంది గాయాలపాలయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయినవారిలో ఐదేళ్ల పాప కూడా ఉంది. ముంబయిని అహ్మదాబాద్ను కలిపే ఎనిమిదో నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సూరత్ వెళుతున్న మినీ బస్సు ముంబయి వెళుతున్న లగ్జరీ బస్సు మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.