10 పైసలకే లీటరు నీరు!

10 పైసలకే లీటరు నీరు!


బెంగళూరు: పది పైసలకు లీటరు నీరు పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు తక్కువ ధరకు మంచినీరు అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని మొదలు పెట్టారు.  విధాన సౌధ బాంక్వెట్ హాలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 300 గ్రామాల్లో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యూనిట్లను ఏకకాలంలో సిద్ధరామయ్య  ప్రారంభించారు.




ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ఒక్కో నీటిశుద్ధి యూనిట్ను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నూతన నిబంధనల ప్రకారం ప్రతి కంపెనీ తన లాభాలలో రెండు శాతాన్ని సమాజశ్రేయస్సుకు ఖర్చు చేయవలసి ఉంటుదని చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top