కుప్పకూలిన భవంతలు: 10 మంది మృతి


కైరో: గ్యాస్ సిలండర్ పేలుడు సంభవించి మూడు భవంతులు కుప్పకూలిన సంఘటన ఈజీప్టు మిన్యా గవర్నేట్లోని మలావిలో చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 10 మంది మరణించారని ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఆ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులు నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.


అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని ఉన్నతాధికారులు వెల్లడించారు. 2012 జులై నుంచి 2013 జూన్ మధ్యకాలంలో ఈజిప్టులో వివిధ సంఘటనల వల్ల దాదాపు 392 భవంతలు కుప్పకూలాయని చెప్పారు. ఆ ప్రమాదాల్లో  192 మంది మరణించారని తెలిపారు. భవనాలు కుప్పకూలడంతో ఆందోళన చెందిన దాదాపు 800 కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయన ఉన్నతాధికారి  వివరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top