నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం


కరీంనగర్: కరీంగనగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ ఏర్పాటు కోరుతూ ప్రాణ త్యాగం చేసిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడంపై చర్చించనున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 164 మంది తెలంగాణ ఏర్పాటు కోసం అమరులైనట్లు సమాచారం. వీరందరికి రూ. 10 లక్షలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హాజరు కానున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top