వైఎస్ఆర్ సిపి తెలంగాణ కమిటీ సమావేశం వాయిదా
హైదరాబాద్: రేపు జరుగవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతల సమావేశం వాయిదాపడింది. లోటస్పాండ్ క్యాంప్ ఆఫీస్లో రేపు ఉదయం 11 గంటలకుపార్టీ తెలంగాణ కమిటీ నేతల సమావేశం జరుగుతుందని ముందుగా ప్రకటించారు.
ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తారని అనుకున్నారు. అయితే అనుకోని పరిస్థితులలో ఈ సమావేశం వాయిదాపడింది.
**