వైఎస్సార్ సీపీ జెండా దిమ్మె కూల్చివేత
తిప్పాయిగూడలో ఘటన: పోలీసులకు ఫిర్యాదు
మంచాల : మండల పరిధిలోని తిప్పాయిగూడలో గుర్తుతెలియని దుండగులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను కూల్చివేశారు. వివరాలు.. తిప్పాయి గూడ చౌరస్తాలో పాత పాఠశాల వద్ద పలు పార్టీల జెండాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ జెండాను ఏర్పాటు చేశారు. ఈనెల 26న గుర్తుతెలియని వ్యక్తులు పార్టీ జెండా దిమ్మెను కూల్చివేశారు. ఈ విషయమై శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాదగోని జంగయ్య గౌడ్ మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెండా దిమ్మె కూల్చివేయడం సరి కాదని చెప్పారు. నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో పార్టీ నాయకులు దాసరమోని సురేష్, బుస్సు ప్రేమాకర్రెడ్డి, ఎన్.జయంత్రెడ్డి, ఎన్నుదుల మహేష్ తదితరులు ఉన్నారు.