జనం గుండెల్లో వైఎస్‌ఆర్

జనం గుండెల్లో వైఎస్‌ఆర్ - Sakshi


వేంసూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఇంకా జనంగుండెల్లో ఉన్నాయని, అందుకే సొంత ఖర్చుతో ప్రజలు ఆయన విగ్రహాలను ఏర్పా టు చేస్తున్నారని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని యర్రగుంటపాడులో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని సోమవారం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మట్టా దయానంద్ విజయ్‌కుమార్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి వరద బాధితులకు వెంటనే నష్ట పరిహారం అందించారని, కానీ ప్రస్తుతం బాధితులు వరద సాయం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని అన్నారు.

 

తొలుత యర్రగుంటపాడు ఎంపీటీసీ ఒం గురు లక్ష్మి దంపతులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మట్టా దయానంద్‌లను సన్మానించారు. అనంతరం దేశిరెడ్డి మాధవరెడ్డి నివాసంలో ఎంపీ పొంగులేటిని, దయానంద్‌లను సన్మానించారు. కార్యక్రమం లో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ అట్లూరి సత్యనారాయణరెడ్డి, రావి సత్యనారాయణ, తుమ్మురు రంగరెడ్డి, దేశిరెడ్డి మాధవరెడ్డి, గడ్డ రామకృష్ణరెడ్డి, తుమ్మరు శ్రీనివాసరెడ్డి, గోగులముడి రామచంద్రరెడ్డి, గాదె శ్రీనివాసరావు, గడిపర్తి శ్రీనివాసరావు, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, దొడ్డ చెన్నకేశవరెడ్డి, చీపు కృష్ణ, గాయం రాం బాబు, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భీమిరెడ్డి చెన్నకేశవరెడ్డి, అల్లం చిన్నబ్బాయి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top