వైఎస్సార్ సీపీ యూత్ కమిటీల నియామకం


జిల్లా కమిటీలోకి 23 మంది

మండల కమిటీలోకి 13 మంది

డివిజన్ కమిటీలోకి 11 మంది

సిటీ కమిటీలో ఇద్దరికి స్థానం

వెల్లడించిన రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, కళ్యాణ్‌రాజ్


 

కాజీపేట రూరల్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, టౌన్, సిటీ, డివిజన్ కమిటీలను ఆదివారం ప్రకటించింది. 51 మందితో యువజన, జిల్లా, మండల, నగర  కమిటీలను నియామకం చేశారు. ఈ మేరకు వివరాలను వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్ ఆదివారం వె ల్లడించారు. జిల్లా యూత్ కమిటీలో జిల్లా యూత్ జనరల్ సెక్రటరీగా బొడ్డు శ్రావణ్, గడ్డం రఘుపతి, దేవర రమేష్, బుర్ర మహేందర్ నియామకమయ్యారు.



కార్యదర్శులుగా కల్లాపు ప్రవీణ్, మేకల సిద్దార్థ, సాంబరాజు ప్రవీన్, మహ్మద్ రహమాన్, జాయింట్ సెక్రటరీలుగా టార్జన్ సింగ్, అక్కల అనిల్ కుమార్, జల్లి వేణు, చిర్ర అనిల్, కాయిత కుమార్, బూర సుదర్శన్‌గౌడ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గాడిపెల్లి శ్రీను, పెసర్ల రాజు, సంపతి కృష్ణ, సయ్యద్ చాంద్‌పాషా, కోటగిరి కృష్ణమూర్తి, గాదె మహేష్, షేక్ జావీద్, కీసరి రాంబాబు, గండ్ల రాజు నియామకమయ్యారు. జనగాం యూత్ టౌన్ అధ్యక్షునిగా గుగ్గిల్ల శ్రీధర్ నియామకం అయ్యారు.



నగర కమిటీలో..

యూత్ నగర ప్రధాన కార్యదర్శులుగా కానుకుంట్ల రమాకాంత్, మోడెం రాజేష్‌గౌడ్ నియామకమయ్యారు.



డివిజన్ యూత్ ప్రెసిడెంట్లు వీరే..

మాత్రాసి శ్రీధర్(29వ డివిజన్),  పరికి నట్‌రాజ్(28వ డివి జన్), పల్లె మధు(30వ డివిజన్), ఎండి.అరిఫ్ అలీ(23వ డివిజన్), గొల్లపెల్లి శేఖర్(34వ డివిజన్),  కాగితాల శ్రీని వాస్(47వ డివిజన్),  అన్వర్ మోహినుద్దీన్(50వ డివిజన్),  ఎండి.ఇమ్రాన్(48వ డివిజన్), కందుకూరి ప్రణయ్(36వ డివిజన్), ఎండి.అబ్దుల్ పర్వేజ్(44వ డివిజన్), అబ్దుల్ సమద్(10వ డివిజన్) నియామకం అయ్యారు.



మండల యువజన అధ్యక్షులుగా 13 మంది..  

రఘునాథపల్లి మండల యువజన అధ్యక్షుడిగా బక్క జంపన్న, మహబూబాబాద్ మండల అధ్యక్షుడిగా నరేందర్‌రెడ్డి, బానోతు వీరన్న(కేసముద్రం), నిమ్మిపోయిన రమేష్(వర్ధన్నపేట), కోతుల మధు (పర్వతగిరి),  కోట సోంరాజు(చేర్యాల), రాజ్‌కుమార్‌గౌడ్(నర్మెట),కోల్పుల పురుషోత్తం(మద్దూరు), బుర్ర సుమన్(నర్సంపేట),  మడుగుల రాజిరెడ్డి(నల్లబెల్లి), అసోల సురేష్(దుగ్గొండి), బానోతు బాలకృష్ణ(ఖానాపురం), ఎస్‌కె.గౌస్(ఏటూరు నాగారం)ను నియమించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top