ఆత్మహత్యలకు బాధ్యులెవరు?
- ట్విటర్లో జగన్ సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక మీడియా ట్విటర్లో సూటిగా ప్రశ్నించారు. బుధవారం ట్విటర్ ఖాతా తెరిచిన జగన్.. గురువారం రైతుల ఆత్మహత్యలపై ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శిస్తున్న క్రమంలో వారి బాధలను ప్రత్యక్షంగా చూస్తున్న జగన్ ట్విటర్లో తొలిసారి రైతు ఆత్మహత్యలపైనే స్పందించారు. ‘‘ఈ రైతు హత్యలకు కారణం.. మోసం చేసిన చంద్రబాబా? విఫలమైన ఆయన ప్రభుత్వమా? సరిగా నిలదీయని సమాజమా?’’ అంటూ రైతు ఆత్మహత్యలపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.