స్కూల్ బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్బ్రాంతి!
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం మసాయి పేట రైలు ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనాస్థలంలో పార్టీ నేతలు సహాయచర్యల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారు.
వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాకతీయ స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో 26మంది విద్యార్థులు మృతి చెందారు. స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్లందరూ మరణించినట్టు సమాచారం. రైల్వే గేట్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.