డెంగ్యూతో యువకుడు మృతి
కొత్తగూడెం రూరల్ (ఖమ్మం) : ఖమ్మం జిల్లా కొత్తగూడెం రూరల్ మండలంలో ఓ యువకుడు డెంగ్యూ జ్వరంతో మృత్యువాతపడ్డాడు. మండలంలోని మైలారం పంచాయతీ పునుకుడు చిలక గ్రామానికి చెందిన కోరం కనకరాజు(24) పది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు ఖమ్మం నగరంలోని మమత ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో కనకరాజు శనివారం సాయంత్రం ఆస్పత్రిలోనే మృతిచెందాడు.