రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


అర్వపల్లి : నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామ శివారులో ఆటో, బైక్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం కొత్తగూడకు చెందిన యాదయ్య ఆదివారం నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి స్వస్థలానికి పల్సర్ బైక్‌పై తిరిగి వెళుతుండగా మార్గమధ్యంలో ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో యాదయ్య తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top