బైక్ పై మోజుతో మృతి ఒడిలోకి
ఖమ్మం: ఖమ్మం జిల్లా మధిర మండలం తొండల గోపవరంలో ఆదివారం సాయంత్రం ఓ యువకుడు బైక్ డ్రైవ్ చేస్తూ.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు...కృష్ణా జిల్లా వీరులపాడు మండలం దొడ్డ దేవరపాడు గ్రామానికి చెందిన గుర్రం నరసింహారావు(19), మధిరలోని శ్రీనిధి డిగ్రీ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో బైక్ నేర్చుకుంటుండగా వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్నుఢీకొట్టింది. దీంతో నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందాడు.
(మధిర)