యువకుడి ఆత్మహత్య


కుత్బుల్లాపూర్ (రంగారెడ్డి జిల్లా) : ఒంటరితనాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవంతంగా తనువు చాలించాడు. రంగారెడ్డి జిలా కుత్బుల్లాపూర్ మండలం ఎంఎన్‌రెడ్డి నగర్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసించే జి.రాకేశ్‌గౌడ్(29) గురువారం రాత్రి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనాన్ని తట్టుకోలేకే ఈ లోకాన్ని వీడుతున్నానని అతడు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top