ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని..
మహబూబ్నగర్ : ప్రియురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిందనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మిడ్జిల్ మండల పరిధిలోని తిమ్మన్నపల్లిలో జరిగింది.
శివాజీ జడ్చర్లలోని బీపీడీ కాలేజీలో పీఈటీ కోర్సు చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమ వ్యవహారంలో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23వతేదీన పెళ్లి చేసుకోవాలని శివాజీ వేధిస్తున్నాడని అతని ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనస్థాపం చెందిన శివాజీ ఆదివారం రాత్రి తన వ్యవసాయ పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.