తల్లి మరణం తట్టుకోలేక


తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ మండలం మక్తభూపతిపూర్ గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఎల్కపల్లి భూమయ్య - బాలమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.


అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారం రోజుల క్రితం బాలమ్మ మరణించింది. ఏడాది క్రితం భూమయ్య పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన వీరి కుమారుడు రాజు(35) బుధవారం రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మెదక్ పోలీసులు కేసు నమోదు చేసి.. మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు.

 

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top