అంకితభావంతో పనిచేయాలి

అంకితభావంతో పనిచేయాలి - Sakshi


మణుగూరురూరల్(ఖమ్మం) : తెలంగాణలో విద్యుదుత్పత్తికి కావాల్సిన బొగ్గును సరఫరా చేసేందుకు కార్మికులు అంకితభావంతో పనిచేయాలని సింగరేణి డెరైక్టర్ ఆపరేషన్స్ డి. రమేష్‌కుమార్ అన్నారు. శనివారం మణుగూరు ఏరియాలో ఆయన పర్యటించారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రమేష్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని, దీని ని దృష్టిలో ఉంచుకుని అధికారులు, కార్మికు లు, సూపర్‌వైజర్లు, యూనియన్ నాయకులు బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు కృషిచేయాలని సూచించారు. పని సామర్థ్యం పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం ద్వారానే సింగరేణికి భారీ మొత్తంలో లాభం జరుగుతుందన్నారు.

 

కాగా, మణుగూరు ఓపెన్‌కాస్టు, కేపీయూ జీ లాండ్ ఆక్విషన్‌పై తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరిపి వారికి తగిన సూచనలు ఇచ్చారు. సమావేశంలో ఎస్‌ఓటూ డెరైక్టర్ సీహెచ్ ఉమామహేశ్వర్‌రావు, ఎస్టేట్ కార్పొరేట్ ఆంథోని రాజు, జీఎం రమణమూర్తి, ఇన్‌చార్జ్ ఎస్‌ఓటూ జీఎం వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు అధికారి ఎల్‌వీ. సూర్యనారాయణ, మణుగూరు ప్రాజె క్టు అధికారి టీవీ రావు, డీజీఎం ఐఈడీ రవి, సుధాకర్, డీజీఎం సివిల్ శ్రీధర్, ఏరియా ఇంజినీర్ రాజాబాబురాజు, డీజీఎం వర్క్‌షాపు మురళీధర్, ఏరియా స్పోర్ట్స్ డీజీఎం శ్రీనివాస్, ఓసీ-2 ఎస్‌ఓ స్వామినాయుడు, ప్రాజెక్టు ఇంజినీర్ స్వామిశేఖర్, ఎస్టేట్ అధికారి దయానంద్, ఫైనాన్స్ మేనేజర్ హనుమంతరావు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top