టీఆర్ఎస్ కార్యకర్తకు మహిళల దేహశుద్ధి
మాచారెడ్డి (నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తకు మహిళలు దేహశుద్ధి చేశారు. మంగళవారం మండలంలోని గ్రామాలకు చెందిన బీడీ కార్మికులు జీవనభృతి కోసం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అదే సమయంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం సీపీఎం చేపట్టిన ప్రచారయాత్ర మాచారెడ్డికి చేరుకుంది.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు నూర్జహాన్ బీడి కార్మికులకు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆమెను అక్కడే ఉన్న ఓ టీఆర్ఎస్ కార్యకర్త అడ్డుకోబోయాడు. అంతేకాకుండా, దురుసుగా ప్రవర్తించడంతో మహిళలు మూకుమ్మడిగా అతడికి దేహశుద్ధి చేశారు.