ఐదు రోజులుగా ప్రియుడి ఇంటి ముందే..


జయశంకర్‌ భూపాలపల్లి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి  ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్న యువకుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్బీనగర్‌కు చెందిన బోడ కళాసాగర్‌ ఇంటి ముందు అతను ప్రేమించిన నాగమణి ఐదురోజులుగా దీక్ష చేస్తోంది. కళాసాగర్‌తో పెళ్లి జరిపించేంత వరకు ఇక్కడి నుంచి కదలనని భీష్మించుకొని కూర్చుంది. యువతికి మహిళా సంఘాల వారు మద్దతు తెలిపారు. కాగా.. ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top