విద్యుద్ఘాతంతో మహిళ మృతి
చేబ్రోలు(నల్గొండ జిల్లా): విద్యుత్ షాక్తో మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం చేబ్రోలు మండలకేంద్రంలో జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన పి.లక్ష్మి(40) భర్తతో కలిసి 20 ఏళ్లుగా జీబీసీ రహదారి పక్కన పూరి గుడిసెలో నివసిస్తూ కల్లు విక్రయించుకుంటూ జీవించేవారు. ఇంటికి సమీపంలో ఉన్న ఎర్త్ వైరును లక్ష్మి పట్టుకోవటంతో షాక్కు గురై అక్కడిక్కడే మరణించింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ షేక్ నాగుల్మీరా సాహెబ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.