మిద్దె కూలి మహిళ మృతి


గోపాల్‌పేట: మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారంలో మట్టి మిద్దె కూలి ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్, సుగుణమ్మ(40) దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం వేకువజామున  ఒక్కసారిగా మట్టి మిద్దె కూలి వారిపైన పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన సుగుణమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. గాయాలైన వెంకటయ్య స్తానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top