బస్సు-ఆటో ఢీ: మహిళ మృతి


యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భువనగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆటోనుగుట్ట నుంచి మూటకొండూరుకు వెళ్లే బస్సు వంగపల్లి గ్రామంలోని మూలమలుపు వద్ద ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న లక్ష్మీ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top