ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
కమలాపూర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గోపాలపూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుడుతాల సత్యమ్మ (58)కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త పదేళ్ల క్రితమే మృతి చెందడంతో కుటుంబ పోషణ కోసం ఆమె రూ.3 లక్షల వరకు అప్పులు చేసింది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన సత్యమ్మ మంగళవారం ఇంటి దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.