గాంధీ ఆసుపత్రిలో తాగుబోతు యువతి అరెస్టు
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో మద్యం సేవిస్తున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నామాలగుండు మహిళా సంరక్షణ కేంద్రానికి చెందిన గర్భిణి నాగలక్ష్మి వైద్యం కోసం గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు సహాయకురాలిగా అదే కేంద్రానికి చెందిన శోభ (22)ను నియమించారు.
అయితే, శుక్రవారం మధ్యాహ్నాం ఆస్పత్రి ప్రాంగణంలో శోభ బహిరంగంగా మద్యం సేవించింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహిళా సంరక్షణ కేంద్రం అధికారులకు సమాచారం అందించి, శోభను అవుట్పోస్ట్ పోలీసులకు అప్పగించారు.