పెళ్లయిన మూడు నెలలకే...

పెళ్లయిన మూడు నెలలకే... - Sakshi

కథలాపూర్: కడుపునొప్పితో బాధపడుతూ కథలాపూర్‌ మండలం తాండ్య్రాలకు చెందిన ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన మూడు నెలలకే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో తాండ్య్రాలలో కలకలం రేపింది. స్థానికులు, ఎస్సై ఆరీఫ్‌ఖాన్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చందన అలియాస్‌ రాధను రాయికల్‌ మండలం రామోజీపేటకు చెందిన చుక్క క్రాంతికిచ్చి మూడునెలల క్రితం పెళ్లిచేశారు.



45 రోజుల క్రితం క్రాంతి ఉపాధికోసం గల్ఫ్‌వెళ్లాడు. అప్పటినుంచి చందన పుట్టినింట్లో ఉంటోంది. నాలుగురోజులుగా చందన కడుపునొప్పితో బాధపడుతోంది. మంగళవారం రాత్రి తన దాబాపైకి చేరుకుని క్రిమిసంహారకమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కోరుట్ల ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది. చందన తల్లి ఇజ్జపు గంగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

 

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top