కాంపౌండ్ రైలింగ్ కూలి మహిళ మృతి


మర్పల్లి: రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామంలో ఎదురింటి కాంపౌండ్ వద్ద కూర్చుని ఉన్న మహిళలపై రైలింగ్ కూలింది. ఈ ఘటనలో పద్మ(30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే మరో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. గమనించిన స్థానికులు గాయపడిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తరలించారు. మృతురాలు పద్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top