యువతి సజీవదహనం


బోడుప్పల్  (హైదరాబాద్) : ఇంట్లో పని చేసుకుంటున్న యువతి విద్యుదాఘాతానికి గురై సజీవదహనమైంది. ఈ సంఘటన నగరంలోని బోడుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హేమానగర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సౌజన్య(18) ఇంట్లో పని చేసుకుంటుండగా.. ప్రమదవశాత్తు కరెంట్ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో యువతి శరీరం పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top