రోడ్డు ప్రమాదంలో యువతి మృతి


రంగారెడ్డి : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ప్రమాదంలో యువతి మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి స్టేజీ సమీపంలో మంగళవారం జరిగింది. బైక్ పై వెళ్తున్న యువతి(23), యువకులను(25) ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతికి తీవ్రగాయాలయ్యాయి.



సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. మృతురాలిది రాంజేంద్రనగర్‌గా భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top