మూడేళ్లకే నూరేళ్లు
వనపర్తిటౌన్: మరోమూడురోజులు గడిస్తే మూడోపుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఓ బాలుడిని మృత్యువు నీటిసంపు రూపంలో బలతీసుకుంది. ఈ విషాదకర సంఘటన సోమవారం వనపర్తి పట్టణంలో చోటుచేసుకుంది.బాధితులు కథనం మేరకు.. స్థానిక గాంధీనగర్ సమీపంలోని ప్యాటగడ్డ ప్రాంతానికి చెందిన రజిని, వెంకటేష్ల ఒక్కగానొక్క కుమారుడు శ్రావణ్(3). తండ్రి వెంకటేష్ బతుకుదెరువు కోసం హై దరాబాద్లో ఉంటూ పదిహేను రోజులకు ఒక్కసారి ఇంటికి వచ్చిపోతుంటాడు.
దీంతో రజిని తన కుమారుడితో పుట్టిం ట్లోనే ఉంటుంది. ఇదిలాఉండగా, అమ్మమ్మ కళావతి రోజు మాదిరిగానే తినుబండారాలు చేసేపనికి వెళ్లింది. తనవెంట తీసుకెళ్లిన మనువడు ఆడుతూ వెళ్లి సమీపంలో ఉన్న నీటిసంపులో పడిపోయాడు. చుట్టుపక్కల ఎక్కడ వెతికినా ఆ బాలుడి ఆచూకీ లభించలేదు. అనుమానం సంపులో చూడగా.. ఆ చిన్నారి శవమై తేలాడు. మేనమామ రాజు నీటి సంపులోకి దిగి బయటికి తీసి బాలుడిని చికిత్సకోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతిచెందాడు. ఈ హృదయవిదారకర సంఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.