మూడుముళ్ల బంధం మరచి ..

మూడుముళ్ల బంధం మరచి .. - Sakshi

బోయినపల్లి (కరీంనగర్‌ జిల్లా): కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన భార్య భర్తను కిరాతకంగా హతమార్చింది. ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా బోయినపల్లి మండలం తడకొండ గ్రామం‍లో గురువారం ఉదయం చోటుచేసుకుంది.



దయ్యాల బాలవ్వ అనే మహిళ, నిద్రపోతున్నభర్త దయ్యాల లచ్చయ్య(60)ను గొడ్డలితో తల నరికి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. గత కొంత కాలంగా వీరు వేరువేరుగా జీవిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన బాలవ్వ భర్తను హత్య చేసింది. ఎస్‌ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top