మూడుముళ్ల బంధం మరచి ..
బోయినపల్లి (కరీంనగర్ జిల్లా): కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన భార్య భర్తను కిరాతకంగా హతమార్చింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం తడకొండ గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.
దయ్యాల బాలవ్వ అనే మహిళ, నిద్రపోతున్నభర్త దయ్యాల లచ్చయ్య(60)ను గొడ్డలితో తల నరికి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఈ దంపతులకు కొడుకు, కుమార్తె ఉన్నారు. గత కొంత కాలంగా వీరు వేరువేరుగా జీవిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన బాలవ్వ భర్తను హత్య చేసింది. ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.