'శ్వేతపత్రం విడుదల చేయాలి'


రేగోడ్‌(మెదక్‌ జిల్లా): మీకు దమ్మూ దైర్యం, సత్తా ఉంటే ఉద్యోగ ఖాళీలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలం గజ్వాడ గ్రామానికి ఆదివారం విచ్చేసన ఆయన ఈ సందర్భంగా  విలేకరులతో మాట్లాడారు.

 

కొత్త జిల్లాలకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వండని అడగడం లేదని..ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పడక ముందు, ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో శ్వేత పత్రం స్పష్టంగా విడుదల చేయాలని రాజనర్సింహ డిమాండ్‌ చేశారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top