దీని భావమేమి!

దీని భావమేమి! - Sakshi


ఈ ఫొటో చూస్తుంటే... ఏమనిపిస్తోంది... కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి నడిరోడ్డుపై తీవ్రస్థాయిలో గొడవపడుతున్నట్లు లేదూ. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన సందర్భంగా చిగురుమామిడి మండలం ముల్కనూరులో జరిగిన ఘటనకు సంబంధించిన ఫొటోలివి. ఆ రోజు నుంచి ఈ ఫొటోలు వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు, ఆవేశకావేశాలకు లోనై, ఒకరిపై మరొకరు అరుచుకున్నట్లు కనిపిస్తున్న ఈ ఫొటోలు పెను సంచలనాన్నే సృష్టిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ప్రస్తుతం ఈ ఫొటోలపైనే చర్చ సాగుతోంది.



జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారిన ఈ ఫొటోలపై ఈద శంకర్‌రెడ్డిని సంప్రదిస్తే, ఆయన నవ్వుతూ తేలిగ్గా తీసిపారేశారు. ‘ఆ రోజు సీఎం కేసీఆర్ అధికారిక కార్యక్రమం కావడంతో టీఆర్‌ఎస్ నాయకులకు అనుమతి లేదు. ఆ సందర్భంలో తాము మాట్లాడుకున్న సన్నివేశాన్ని ఎవరో ఫొటోలు తీసి, గొడవపడుతున్నట్లు చిత్రీకరించారు’ అని చెప్పారు. తనకు వినోద్‌కుమార్ అంటే అపార గౌరవమని, తాను ఆయనతో గొడవపడడమేంటని ఎదురు ప్రశ్నించారు. కాగా గొడవ జరిగినా, జరగకపోయినా ఈ ఫొటోలు మాత్రం జిల్లాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.

 - కరీంనగర్ సిటీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top