'ఆయన తెలంగాణలో పర్యటించి ఏం చేస్తారు'
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించి ఏం చేస్తారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు కోల్పోయిందని విమర్శించారు. భూ సేకరణ చట్టాన్ని రాజకీయం చేయెద్దని దత్తాత్రేయ సూచించారు. కార్మిక శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి' అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.