'ఆ కథనాలపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తాం'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాలను అగౌరవపరిచేలా కథనాలు ప్రచురిస్తున్న పత్రికలపై హెంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ అంశంపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని నాయిని స్పష్టం చేశారు. ఆ తప్పుడు కథనాలను రాస్తున్న పత్రికలు ఇకనైనా అటువంటి కథనాలను మానుకోవాలని సూచించారు. తెలంగాణ సంస్కృతిని కించపరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
శుక్రవారం తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రను కొనియాడుతూ మీడియాతో మాట్లాడిన నాయిని.. తాము విద్యార్థుల ఉద్యమాలను ఎప్పుడూ గౌరవిస్తామని తెలిపారు. ఓయూ పోస్టర్ వివాదం వెనుక టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల పాత్ర ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.