కాంగ్రెస్‌ నేతలతో భేటీని స్వాగతిస్తున్నాం

కాంగ్రెస్‌ నేతలతో భేటీని స్వాగతిస్తున్నాం - Sakshi


హైదరాబాద్‌సిటీ: మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సీఎం భేటీని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..ఉగాది నుంచి సీఎంలో వచ్చిన మార్పు ఎన్ని రోజులుంటుందో కానీ అది మంచిదేనన్నారు. ధర్నా చౌక్‌లను షిప్ట్ చేస్తేనో గొంతు నొక్కితోనో పనులు కావని తెలిపారు.



మహబూబ్ నగర్ జిల్లా సమస్యలతోపాటు ఇతర జిల్లాల ప్రతిపక్ష నేతలతో సీఎం సమావేశం కావాలని కోరారు. పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ఫీజుల నియంత్రణ కమిటీ ఏం చెప్పిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యావ్యవస్థలో కార్పోరేట్ ఆధిపత్యం ఉందని, సీఎం జోక్యం చేసుకుని విద్యా దోపిడీని అరికట్టాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top