'23 శాతం ఓట్లు రావడం చిన్నవిషయం కాదు'
హైదరాబాద్: గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 23 శాతం ఓట్లను సాధించడం చిన్న విషయం కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. శుక్రవారం సరూర్ నగర్ లో బీజేపీ గ్రామ అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి ప్రతీ ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు. తాజాగా విడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలను కాంగ్రెస్ పార్టీనే విభజించిందని అమిత్ షా విమర్శించారు. ఏపీ విభజనలో రాజకీయాలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదర్చకుండా విభజనకు కాంగ్రెస్ పార్టీ పూనుకుందన్నారు. తెలంగాణలో గ్రామగ్రామాన బీజేపీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2019 తెలంగాణ బీజేపీ సర్కారు రావాలనిన అమిత్ షా అధ్యక్షులకు విజ్క్షప్తి చేశారు.