పాలమూరు పురోగతికి సమష్టిగా కృషి చేద్దాం
మహబూబ్నగర్ : పాలమూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ శ్రీదేవి పిలుపునిచ్చారు. 66వ గణతంత్ర వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు.
అనంతరం పోలీసుల నుంచి కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు అందేలా అన్ని విభాగాలు దృష్టి సారించాలన్నారు. ఆయా శాఖల ద్వారా చేపడుతున్న పథకాలు, వాటి ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని ఆమె వివరించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ విశ్వప్రసాద్, ఇన్చార్జ్ జేసీ రాజారాం, డీఆర్వో ఎం.రాంకిషన్, ఏఎస్పీ మల్లారెడ్డి, ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు.
సంబంధిత వార్తలు