వరంగల్ మార్కెట్లో రైతుల ఆందోళన
వరంగల్: తేమ పేరుతో సీసీఐ అధికారులు మూడు రోజులుగా కొనుగోళ్లు చేపట్టకుండా నిలిపివేయడంతో రైతులు వరంగల్ ఎనుమా ముల వ్యవసాయ మార్కెట్లో శనివారం దాదా పు ఆరు గంటల పాటు ఆందోళన చేశారు. సీసీఐ అధికారుల బ్యానర్లను దహనం చేయడంతోపాటు మార్కెట్ ప్రధాన గేట్కు తాళం వేశారు. ప్రధాన రహదారిపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
రైతులకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి ధర్నాలో కూర్చోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెల కొంది. ఈ సందర్భంగా సీసీఐ కార్యాలయ ఫర్నిచర్, కంప్యూటర్ను బీజేపీ నాయకులు ధ్వంసం చేశారు. దీంతో అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రైతులు మళ్లీ మార్కెట్ పరిపాలనా భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా మాజీమంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆందోళనలో పాల్గొన్నారు.
సీసీఐ, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్లో పత్తి కొనుగోళ్లు చేపట్టేందుకు సీసీఐ అధికారులతో వచ్చిన జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ను రైతులు అడ్డుకున్నారు. ఆయన నేరుగా పత్తియూర్డుకు వెళ్లి సీసీఐతో కొనుగోళ్లు చేయించ డంతో కాంగ్రెస్ నాయకులు ఆందోళన విరమించారు.